
విశాఖపట్నం/జులై 16(ట్రూ న్యూస్ ) ఆర్ సీఈ డి ఎం మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖాజా రహమతుల్లా ఆధ్వర్యంలో గురువారం మైనార్టీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు.కార్యక్రమం నకు ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మొహమ్మద్ నజీర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమం లో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు బి మధు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గాజువాక సమీపంలో వున్న ఇస్లాం పేట రిజ్వాన్ వారి తో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు టెట్ అభ్యర్థులుcకూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులు అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాలను స్వహస్తాలతో అందజేసి, పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మైనారిటీ విద్యార్థులకు విద్యాపరంగా అండగా నిలుస్తున్న (ఆర్ సీ ఈ డి ఎం )రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ఈ సందర్భంగా పలువురు కృతజ్ఞతలు తెలిపారు.




