విశాఖపట్నం
మర్రిపాలెం మస్జీద్ ఎ అల్ ఫథహ్ నూతన కమిటీ ఎన్నిక లొ చాంద్ సితార ఎన్నిక

అధ్యక్షులు గా అన్వర్ హుసేన్
కార్యదర్శి గా ఎం డి ఇంతియాజ్
విశాఖపట్నం/సెప్టెంబర్ 2(ట్రూ న్యూస్ ) : మర్రిపాలెం మస్జీద్ ఎ అల్ ఫతహ నూతన కార్యవర్గం ఎన్నిక,బుధవారం మసీదు ఆవరణలో జిల్లా వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగింది. చాంద్ సితార మరియు స్టార్ పానల్ మధ్య పోటాపోటీగా జరిగిన ఎన్నికలొ చాంద్ సితార కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.అధ్యక్షులు గా అన్వర్ హుసేన్,ఉపాధ్యక్షులు గా ఎస్ కే రఫీ,కార్యదర్శి గా ఎం డి ఇంతీయాజ్,జాయింట్ సెక్రటరీ ఎం డి బాబ్జి,క్యాషియర్ గా ఎం డి యూనస్,సభ్యులు గా ఎం డి ఇర్ఫాన్,ఎస్ కే ఇమామ్,మహబూబ్ అలి,ఎం డి సలీం,ఎం డి షమీర్,ఎం డి అసరఫ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మర్రిపాలెం మస్జీద్ఎ అల్ ఫతహ నూతన కమిటీ కి స్థానిక ముస్లిం లు అంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు.




