విశాఖపట్నం
ఘనంగా బడే పీర్ గౌస్ పాక్ వారి జెండా నిర్మాణ కార్యక్రమం

విశాఖపట్నం/జూన్ 19 : విశాఖ కోటవీధిలో ఉన్న హజరత్ బాబా షాబుద్దీన్ దర్గా నిర్మాణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది.కార్యక్రమం లో భాగంగా హజరత్ బడే పీర్ వారి జెండా ఏర్పాటు చేశారు. అనంతరం ప్రత్యేక ఫాతేహ కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు.కార్యక్రమంలో విశాఖ వైసీపీ మైనార్టీ అధ్యక్షులు బర్కత్ అలి, యారాడ దర్గా ముతవల్లి అబ్దుల్ ఖయ్యుం, ఆఫ్సర్ ఖాన్, విశాఖ మైనార్టీ నాయకులు బాష, ఖాసీం, హాఫిజ్, సమీర్, జిలాని,షంసిర్, షఫీ తదితరులు పాల్గొన్నారు.




