రాజకీయాలువిశాఖపట్నం
విశాఖ జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకలు.

విశాఖపట్నం జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకలు జరిగాయి.ఈవేడుకల్లో కె.కె రాజు ,మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ ,పార్టీ శ్రేణులతో కలిసి YSRTUC జెండాను ఆవిష్కరించారు.అనంతరం దివంగత నేత డా” వై.యస్ రాజశేఖరరెడ్డి ,డా” బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




