విశాఖపట్నం
ఫేక్ ఐడెంటి కార్డులతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పనులు మానుకోవాలి – షేక్.బాషా

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజలకు అండగా ఉండాలే తప్ప ప్రజలను వేధించి వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు షేక్.బాషా అన్నారు. మానవ హక్కుల పై పోరాటం చేయాలి తప్ప ఎలాంటి అన్యాయ కార్యక్రమాలు చేపట్టకూడదని షేక్ బాషా కోరారు.
కొందరు ఫేక్ ఐడెంటి కార్డులతో తాము హ్యూమన్ రైట్స్ ఆర్టిఐ ప్రతినిధులమని చెపుతూ అన్యాయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వారి వల్ల సంఘాలకు చెడ్డ పేరు వస్తుందని షేక్ భాషా ఆన్నారు.




