మతం
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 24వ వార్షికోత్సవ సభకు ఆహ్వానం
శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం భీమిలి శాఖ ఆధ్వర్యంలో తేదీ 25 -12 -2025 గురువారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆధ్యాత్మిక సభ నిర్వహించబడును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 552 సంవత్సరాలుగా అర్ధ సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో మతాతితమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన సర్వమత సమతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ జాతి, కుల, మత, స్త్రీ పురుష ,దనిక, పేద అనే భేదం లేకుండా మతసామరస్యాన్ని పెంపొందించే విధానంలో మానవ మనుగడ శాంతి సహృద్భావ వాతావరణంలో కొనసాగి సమాజ చైతన్యానికి, అభివృద్ధికి, మానవతా విలువల పరిరక్షణకు కృషి చేయుచున్నది. ఈ సందర్భంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ విని తరలి రావాల్సిందిగా ఆహ్వాన కమిటీ కోరుచున్నారు.




